కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో బీపీఈడీ, డీపీఈడీ చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 6, 7, 8, 9వ తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 70 మార్కులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధికారులు తెలిపారు. సబ్జెక్టులవారీగా పూర్తి వివరాలకు https://kru.ac.in/ను సందర్శించాలని సూచించారు.