KMM: సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేస్తూ సత్తుపల్లిలో కార్మికులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుడు జె.వి.ఆర్ విప్లవ గీతాలతో కార్మికులను ఉత్తేజపరిచారు. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు.