MDCL: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నూతన రేషన్ కార్డుల మంజూరు, నెంబర్ల అడిషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. మార్చి మొదటి వారంలో నెంబర్ అడిషన్ జరిగిన కొంతమంది ఇప్పటికీ రేషన్ బియ్యం పొందినట్లు పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు అప్లికేషన్ నెంబర్ సహాయంతో స్థానిక మీసేవ, నెట్ కేంద్రాల్లో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.