HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. వరంగల్ ఎంపీ. డా. కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. మరోసారి తన వైద్య వృత్తిని స్మరింపజేస్తూ ఈ శిబిరానికి వచ్చిన ప్రజలతో ఆమె నేరుగా మమేకమయ్యారు. వారికి బీపీ చెక్ చేసి, వైద్య రిపోర్టులు పరిశీలించి, మెడిసిన్ అందజేశారు.