KMM: వెలుగుమట్ల భూదాన్ భూములు నిరుపేదలకే దక్కాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం అత్యంత దుర్మార్గమని చెప్పారు. అర్హులైన పేదలకు న్యాయం చేయాలన్నారు.