KMM: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తల్లాడ మండలం గంగదేవి పాడు గ్రామానికి చెందిన సత్తెనపల్లి నరసయ్యకు విశ్వబ్రాహ్మణ సంఘం అండగా నిలిచింది. తల్లాడ మండల అధ్యక్షుడు నరసింహ చారి ఆధ్వర్యంలో సోమవారం వైద్య ఖర్చుల నిమిత్తం రూ.16,116 రూపాయలను అందించారు. వ్యాధిగ్రస్తుడు అయిన నరసింహ చారి ఆ కుటుంబానికి భారం కాకూడదని సాయం అందించినట్లు వారు తెలిపారు.