WGL: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం నగరంలో వేగంగా అమలవుతోంది. ఇందులో భాగంగా GWMC కార్యాలయం వద్ద స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA నాయిని రాజేందర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.