VKB: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను పెండింగ్లోనే ఉంచకుండా అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 186 దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో వస్తారని, వారి వినతులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు.