MHBD: ఇనుగుర్తి మండలంలోని ఇనుగుర్తి, చిన్న ముప్పారం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు గంజాయి, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్సైరాజేశ్వరి మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు వాడితే కలిగే నష్టాలపై వివరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.