JNG: పాలకుర్తి మండలం మేకలతండ BRS గ్రామ పార్టీ నాయకులు లకావత్ రమేష్ నాయక్ తండ్రి దుద్యా నాయక్ అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున మరణించారు. విషయం తెలుసుకున్న జిల్లా యువజన నాయకులు, గుడికుంట తండా సర్పంచ్ బానోత్ నాయక్ వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి పార్థివదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.