KNR: శంకరపట్నం మండలం కాచాపూర్లో సోమవారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, దళిత నాయకులు పాల్గొని సామాజిక న్యాయం, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.