ప్రకాశం: వచ్చే స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం పామూరు వైసీపీ కార్యాలయంలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఐక్యత, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని అన్నారు.