AP: ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలిచే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 5, 8/ఆగస్టు 17, 19 తేదీల్లో ఏదో రోజున పోర్టును ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మరో 6 కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు చెప్పారు.