ADB: రాయితీ బియ్యాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలియజేశారు. రాయితీ బియ్యం అక్రమాలను అరికట్టేందుకుగాను పట్టణంలోని రేషన్ డీలర్లతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బ్రోకర్లతో కుమ్మక్కై రాయితీ బియ్యానికి దుర్వినియోగం పాల్పడితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.