MDCL: యాసంగి రైతు భరోసా పథకం 2025-26 కింద అర్హులైన రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. 2026 ఫిబ్రవరి 28 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతుల నుంచి కూడా దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే అర్హులైన అందరికీ రైతుబంధు నిధులు జమ అవుతాయని కీసర మండల వ్యవసాయ శాఖ అధికారి మాధవిలత వెల్లడించారు.