NRPT: ఇంటర్మీడియట్ విద్యార్థులు భయాందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఊట్కూర్ ఉప సర్పంచ్ ఆర్. రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎం. భరత్ అన్నారు. బుధవారం ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు మనోధైర్యం ఇచ్చి, ఆందోళన లేకుండా శ్రద్ధగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.