BHNG: మోత్కూర్-తిరుమలగిరి నేషనల్ హైవేపై రైతులు కంది కల్లం పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేగంగా వాహనాలు వెళుతుండటంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు అక్కడ కంట్రోల్ కాక, వన్ సైడ్ వెళ్లలేక ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. కందులు తూర్పార పడుతుండటంతో పొట్టు వాహనదారుల కళ్లలో పడుతుంది. పోలీసులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.