NLG: శ్రీరామనవమి సందర్భంగా మిర్యాలగూడ రెడ్డి కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని స్వామివారి రథయాత్రను ప్రారంభించగా కనువిందుగా సాగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి, డీఎస్పీ రాజశేఖర్ రాజు, స్థానిక నేతలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు