WGL: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా టెండర్ను స్థానిక గ్రామస్తులకే కేటాయించాలని కోరుతూ అఖిలపక్ష నాయకులు సోమవారం ఎమ్మెల్యే నాగరాజును కలిశారు. ఇతర ప్రాంతాల వ్యక్తులు టెండర్ పొందడంతో భక్తులపై అధిక వసూళ్ల భారం పడుతోందని వివరించారు. స్థానికులకు టెండర్ ఇస్తే అక్రమ వసూళ్లు తగ్గి భక్తులకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు.