BDK: మణుగూరు ప్రాంతానికి చెందిన సంతోష్ – రమాదేవి దంపతుల కుమార్తెలు లావణ్య మరియు వెంకట శ్రీల ఓణీల అలంకరణ వేడుకలో నేడు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బాలికలకు ఆశీస్సులు అందించి, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి కుటుంబ వేడుకలు సమాజంలో ఆనందాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.