KMR: గాంధారిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మల్లన్న స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.