JGL: నియోజకవర్గంలో విద్యుత్ షాక్తో మరణించిన పశువుల లబ్ధిదారులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం చెక్కులు పంపిణీ చేశారు. బుగ్గారం సెక్షన్ పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన అనిల్కు రూ.40 వేలు, గోపులాపూర్ గ్రామానికి చెందిన విజయకు రూ.40 వేలు, రాయపట్నంకి చెందిన సత్తయ్యకు రూ.40 వేలు, నక్కలపేటలోని గంగవ్వకు రూ.40 వేలు, గంగన్నకు రూ.7 వేల విలువైన చెక్కులను అందజేశారు.