NZB: గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను సూచించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ను కలెక్టర్ బుధవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా జిల్లాలో ప్రధానమైన ఈ పుష్కర ఘాట్ను బుధవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు.