VKB: రంజాన్ పండుగను పురస్కరించుకుని యాలాల ఈద్గాలో కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు అక్బర్ బాబా ఆధ్వర్యంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు పేరి రాజేందర్ రెడ్డి, సర్పంచ్ శివయ్య ముస్లిం సోదరులను ఆలింగనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులందరికీ కీర్ పంపిణీ చేయడం జరిగింది.