SRPT: రాష్ట్ర ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా రక్షణ, రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తామని ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పోలీస్ కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యపరుస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.