ADB: ప్రజలు నమ్మకంతో కట్టబెట్టిన తమ పదవులకు న్యాయం చేయాలని బోథ్ ఎంపీడీవో రమేష్ పేర్కొన్నారు. ఇవాళ బోథ్ మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వారి యొక్క పాత్ర, విధులు, బాధ్యతలు గురించి వివరించారు.