SRPT: నేరేడుచర్ల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ వెంకటరెడ్డి అన్నారు. ‘ప్రజా పాలన -99 రోజుల ప్రణాళిక’లో భాగంగా శనివారం వైస్ ఛైర్మన్ సందీప్ రెడ్డితో కలిసి పాత నేరేడుచర్ల, విద్యా నగర్లోని శ్మశాన వాటికల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రతి వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.