BDK: ఎన్నికల్లో గెలవాలనుకుంటే ప్రజాస్వామికంగా గెలవాలని, కానీ పోలీసులను వాడుకోవడం దేనికని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని సీపీఐ అభ్యర్థిని ఒక సీఐ తుపాకీ పెట్టి బెదిరించాడని ఆరోపించారు. తమ అభ్యర్థులను పోలీసులతో అణచివేయాలని చూసిన ఎన్నికల్లో గెలిచి చూపించామన్నారు.