BDK: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. వెంటనే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల సీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.