JN: జిల్లా కేంద్రంలో ఒడిశా నుంచి హైదరాబాద్కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని బుధవారం జనగాం పోలీసులు అరెస్ట్ చేశారు. బస్స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని తనిఖీ చేయగా వారి వద్ద సుమారు 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు భగవాలే రాజ్ కుమార్, కోట నిఖిల్ వీరిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.