MNCL: సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం, 4 లేబర్ కోడ్స్ రద్దుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని TNTUC నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లిలో ప్రధాన కార్యదర్శి మనీరామ్ సింగ్ మాట్లాడుతూ.. సింగరేణిలో ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో గుర్తింపు సంఘాలు విఫలమయ్యాయని విమర్శించారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు.