JGL: జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీ.ఎస్. లత ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట, మెట్పల్లి మండలం కొండ్రిక్యాల రైస్ మిల్లులను సందర్శించి రికార్డులను పరిశీలించారు. నిర్దేశిత గడువులో కోటాను పూర్తి చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. అనంతరం 544 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో నిర్లక్ష్యం ఉండకూడదన్నారు.