HYD: హోలీ వేడుకల ముసుగులో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రంగులు చల్లే నెపంతో వేధింపులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై కఠిన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా షీ-టీమ్స్, గస్తీ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు.