MNCL: నెన్నెల మండలం గుండ్లసోమారంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు ఎదురుకుంటున్న అంగన్వాడీ టీచర్ వరలక్ష్మిపై సోమవారం సర్పంచ్ సింగతి రాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్ సమయపాలన పాటించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. సమయపాలన పాటించి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.