రెండు నదుల మధ్య ఉన్నా నడిగడ్డ రైతులకు చుక్క నీరు అందకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ. గోపాల్ అన్నారు. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ జనసభ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆర్డీఎస్ కింద 87 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు.