SRPT: 2024 ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కారు డ్రైవర్ షేక్ బాజీకి కోదాడ కోర్టు గురువారం 15 నెలల జైలు శిక్ష, 2500 రూపాయల జరిమానా విధించిందని అనంతగిరి ఎస్సై నవీన్ తెలిపారు. తమరబండపాలెం వద్ద కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో మోహన్ రావు మృతి చెందగా, పవన్ గాయపడ్డారు. కేసు సమర్థవంతంగా విచారించిన అనంతరం కోర్టు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు.