మహబూబ్నగర్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ తన గొప్ప మనసును చాటుకున్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ పదవి డివిజన్లో కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా భూత్పూర్కు చెందిన 19 ఏళ్ల నవీన్ ఎంవీఎస్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే స్పందించిన మేయర్ అంబులెన్స్ కోసం చూడకుండా క్షతగాత్రుడిని తన వాహనంలో ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించారు.