KMR: తెలంగాణ హైకోర్ట్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కామారెడ్డి ప్రాంతానికి చెందిన పి.శ్రవణ్ కుమార్ గౌడ్ భారీ మెజారిటీతో సెక్రటరీగా ఎన్నికయ్యారు. దోమకొండ మండలం గొట్టుముక్కుల గ్రామానికి చెందిన ఆయన 16 ఏళ్లుగా హైకోర్ట్లో న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. ఇంతకు ముందు 2019-21 కాలంలో కోశాధికారిగా పనిచేసిన శ్రవణ్ ప్రస్తుతం ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.