WGL: రాయపర్తి మండలం కోలన్ పల్లి గ్రామంలో బుధవారం మాజీ జడ్పీటీసీ వంగళ యాకమ్మా ఇంట్లో పని చేస్తుండగా జారిపడి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ మండల పార్టీ నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆమె స్వగ్రామానికి తరలివెళ్లారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.