KMM: కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా, ప్రస్తుతం 21.5 అడుగులకు చేరింది. సాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సాగు, తాగునీటి అవసరాలకు నీరు పుష్కలంగా ఉండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.