HNK: హనుమకొండలో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పబ్లిక్ గార్డెన్స్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికీ మాజీ ఖాదీ, చిన్న పరిశ్రమల డైరెక్టర్ ఈగ మల్లేశం, నేతలు పూలమాలవేసి నివాళులర్పించారు. నటుడిగానే కాకుండా, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి, అతి తక్కువ సమయంలోనే చరిత్ర సృష్టించిన రాజకీయ దిగ్గజం ఎన్టీఆర్ అని మల్లేశం అన్నారు.