HYD: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్లో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దావత్ -ఈ -ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మాజీ మంత్రి KTR ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన మత పెద్దలతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి మహ్మద్ అలీకి ఖర్జూర తినిపించి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.