SRPT: హుజూర్ నగర్ మండల కేంద్రంలోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల్లో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఈ నెల రెండో వారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. గురువారం ఆయన పనులను పరిశీలించి, వారం రోజుల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. అర్హులైన వారికే పారదర్శకంగా ఇళ్లను కేటాయించాలని అన్నారు.