SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో శుక్రవారం సందర్భంగా భక్తజన సంద్రమైంది . వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తరించారు. భీమేశ్వరాలయంలో అభిషేకం, అన్న పూజ , కళ్యాణం, తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు.