VKB: శుక్రవారం కొడంగల్ మండల పర్సాపూర్ రైతు వేదికలో నూనె గింజల సాగు లాభాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. TRVK కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పంటల మార్పిడి కింద నూనె గింజల సాగు రైతులకు పెట్టుబడి ఆదా, చీడపీడల తగ్గింపు వంటి ప్రయోజనాలను ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ADA శంకర్ రాథోడ్, AO శ్రీలత, EEOలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.