రాత్రిపూట పడుకునే ముందు తప్పనిసరిగా దంతాలు శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల ఇన్ఫెక్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. నైట్ పళ్లు తోముకుంటే దంతాల మధ్యలో ఇరుక్కున్న ఆహారకణాలు తొలగిపోతాయి. అయితే డిన్నర్ చేసిన వెంటనే కాకుండా కనీసం అరగంట ఆగి బ్రష్ చేసుకోవాలని సూచిస్తున్నారు.