BDK: పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో మణుగూరులోని పరీక్ష కేంద్రాలను ఇవాళ డీఎస్పీ రవీంద్ర రెడ్డి, సీఐ నాగబాబు పరిశీలించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని డీఎస్పీ సూచించారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.