GDWL: అయిజలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసి అగ్ని ప్రమాదాల నివారణకు సహకరించాలని 4వ వార్డ్ కౌన్సిలర్ జ్యోతి పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్ ఛైర్మన్ సీఎం సురేష్, వైస్ ఛైర్మన్ నరసింహులు, కమిషనర్ సైదులును కలిసి వినతిపత్రం ఇచ్చారు. గద్వాల రోడ్డులోని సర్వేనెంబర్ 65లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే అనువుగా ఉంటుందన్నారు.