ASF: పెంచికల్ పేట్ మండలంలో చుక్కల దుప్పిని హతమార్చిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు FRO అనిల్ కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం లోడుపల్లి గ్రామానికి చెందిన అర్జయ్య, పెద్దల లక్ష్మయ్య, కొట్రంగి పున్నం ఈనెల 30న ఉచ్చులు బిగించి చుక్కల దుప్పిని హతమార్చినట్లు విచారణలో వెళ్లడైంది. వీరిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.