NLG: శాలిగౌరారం మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ అనేది కేవలం మాటలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు జరగలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు.